- వయనాడ్నుంచి రాహుల్
- బెంగళూరు రూరల్ నుంచి డీకే తమ్ముడు సురేశ్
- శివమొగ్గ నుంచి స్టార్ హీరో భార్య గీతా శివరాజ్కుమార్
టీఎస్, న్యూస్ :కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం 36 మంది పేర్లను తొలి జాబితాలో ప్రకటించింది. కేరళలోని వయానాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారు. గత ఎన్నికల్లోనూ రాహుల్ ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. కాగా, తొలి జాబితాలో కర్ణాటక డిప్యూటీ సీఎం శివ కుమార్తమ్ముడికి అవకాశం ఇచ్చారు. బెంగళూరు రూరల్ నుంచి శివ కుమార్తమ్ముడు డీకే సురేశ్ పోటీ చేస్తారు. కర్ణాటకలోని శివమొగ్గ నుంచి శాండల్వుడ్ స్టార్ హీరో భార్య గీతా శివ రాజ్కుమార్ పోటీ చేయనున్నారు.
ఛత్తీస్గఢ్ నుంచి 6, కర్ణాటక నుంచి 6, కేరళ నుంచి 15, మేఘాలయ నుంచి రెండు, నాగాలాండ్ నుంచి ఒకటి, సిక్కిం నుంచి ఒకటి, తెలంగాణ నుంచి నాలుగు, త్రిపుర నుంచి ఒక స్థానంలో అభ్యర్థులను ప్రకటించింది.